Tuesday, March 26, 2024

Breaking : 66మంది మెడిక‌ల్ స్టూడెంట్ల‌కు క‌రోనా.. విద్యార్థులు ఉంటున్న హాస్ట‌ల్‌ మూసివేత ..

క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దాంతో ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. కాగా.. తాజాగా కర్ణాటక ధార్వాడ్ 66 మంది మెడికల్ స్టూడెంట్లకు కరోనా సోకింది. వైరస్ సోకిన వారంతా ఎస్డీఎమ్ మెడికల్ కాలేజీ విద్యార్థులే. వీరంతా రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్దులు ఉంటున్న రెండు హాస్టళ్లను మూసివేశారు. సుమారు 400 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గడంతో స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇదే కొంప ముంచుతోంది. ఇటీవల కాలంలో పలు పాఠశాలల్లో, కాలేజీల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement