Tuesday, April 23, 2024

Breaking : హాట్ టాపిక్ గా యూపీ ఎన్నిక‌లు – ఉన్నావ్ రేప్ బాధితురాలి త‌ల్లికి కాంగ్రెస్ టికెట్

యూపీ అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి ప్రియాంక‌గాంధీ. 125మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాని ప్ర‌క‌టించారు. 40శాతం మ‌హిళ‌లు,40శాతం మంది యువ‌త‌కు అవ‌కాశాన్ని క‌ల్పించారు. ఉన్న‌వ్ రేప్ బాధితురాలి త‌ల్లికి కాంగ్రెస్ టికెట్ ని ప్ర‌క‌టించారు. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ ప్రియాంక గాంధీ కీలక ప్రకటన చేశారు. ఉన్నావ్ రేప్‌ బాధితురాలి తల్లికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్లు ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన చేశారు.125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌తో సహా 50 మంది మహిళలు ఉన్నారన్నారు.దీంతో యూపీ ఎన్నికలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.
లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement