Thursday, April 18, 2024

Breaking: బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ గా మారినట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు సీఈసీ సమాచారమిచ్చింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు లేఖ పంపింది. పార్టీ పేరు మార్పు కోరుతూ అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే నోటిఫికేషన్ ను కూడా ఈసీ విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో .. రేపు అనగా డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు దివ్య ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు రిప్లై గా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుంది. అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. పతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement