Saturday, April 20, 2024

రాజ‌మౌళి కాళ్లు మొక్కిన బాలీవుడ్ స్టార్ హీరో ‘ర‌ణ‌బీర్ క‌పూర్’

బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారారు రాజ‌మౌళి. కాగా ఆయ‌న బాలీవుడ్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర ప్రెస్ మీట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా వెళ్లారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్… టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాళ్లు మొక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరో అందునా బాలీవుడ్ న‌టుడు .. రాజమౌళి కాళ్ళు మొక్కడం ఏంటి అని అందరూ షాక్ కు గురి అవుతున్నారు. కాగా రణబీర్ హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున , బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement