Thursday, March 28, 2024

Bhupalaplly: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. ఆస్పత్రిలో శిశువు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పటల్లో శుక్రవారం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన అటకాపురం లావణ్య శుక్రవారం డెలివరీ కాగా.. హాస్పటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో మగ శిశువు మృతి చెందాడు. బాధితులు జరిగిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జిడి తిరుపతిని నిలదీశారు.

అయితే, వారు తనకేమీ తెలియదని తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన బాధితులు, వారి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంబంధిత వైద్య సిబ్బంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై చర్యలు తీసుకునే వరకు ధర్నా విరమించుకుని లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement