Saturday, April 20, 2024

బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న బాలీవుడ్ స్టార్ క‌రీనాక‌పూర్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుంది. క‌ల‌ర్స్ టీవీలో స్పై బ‌హు కొత్త పోగ్రామ్ కి హోస్ట్ గా మార‌నుంది. . ‘స్పై బహు’ అనేది యువ డిటెక్టివ్ సెజల్ , అనుమానిత ఉగ్రవాది యోహాన్ మధ్య ప్రేమ గురించి తెలిపే ఆసక్తికరమైన కథ. ఈ ఇద్దరి జీవితాల్లో భిన్నమైన మలుపులు వచ్చినప్పుడు, ఇద్దరూ ఒకరినొకరు ప్రేమలో పడతారు..కానీ ఒక‌రి గురించి ఒక‌రి నిజాలు తెలియ‌వు. ఈ సీరియల్‌ని అశ్విని యార్డి విన్నర్స్ ఫిల్మ్స్ నిర్మించింది అయూబ్ ఖాన్, శోభా ఖోటే, భావనా ​​బల్సావర్ వంటి పవర్‌ఫుల్ స్టార్స్ ఈ సీరియ‌ల్ లో నటించనున్నారు.కాగా ఈ సీరియల్‌పై కరీనా కపూర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “నాకు ప్రేమకథలు చాలా ఇష్టం, ఎవరు ఇష్టపడరు.. కొన్ని ప్రేమకథలు హృదయానికి ఆనందాన్ని,ఓదార్పునిస్తాయి, కొన్ని కథలు చాలా రహస్యంగా ఉంటాయి. కలర్స్ కొత్త సీరియల్. ‘స్పై బహు’ అనేది డిటెక్టివ్ సెజల్, అనుమానిత ఉగ్రవాది యోహాన్‌ల యొక్క అద్భుతమైన ప్రేమకథ, ఇది నన్ను చాలా ఆకర్షించింది. ప్రేక్షకులు వారి కెమిస్ట్రీని ఇష్టపడతారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement