Wednesday, April 17, 2024

Black Magic: అతనో డాక్టర్.. క్షుద్ర పూజల కోసం భార్యనే చంపేశాడు..

అతనో డాక్టర్.. క్షుద్రపూజలు చేసే వ్యక్తి మాటలు నమ్మాడు.. జల్సాలకు అలవాటు పడ్డాడు.. లచ్చిందేవి తనను కరుణిస్తుందని, ఈజీగా మనీ వస్తుందన్న మాయ మాటలకు తలవంచాడు. నర బలి ఇస్తే కట్టలు కట్టలు డబ్బులొచ్చి పడతాయని మాంత్రికుడి మాటలతో సొంత భార్యనే చంపేశాడు. ఇందుకోసం ఓ కన్నింగ్ ఐడియా వేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కర్నాటకలోని దావణగెరె జిల్లాలో ఈ ఘటన జరిగింది..

కర్నాటర రాష్ట్రంలోని దావణగెరె జిల్లా న్యామాతి తాలూకా రామేశ్వర గ్రామానికి చెందిన శిల్ప (36), చెన్నేశప్ప (45) భార్యాభర్తలు. వీరికి 2005లో పెండ్లి అయ్యింది.  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. డాక్టర్ గా పనిచేసే చెన్నేశప్ప ఈ మధ్య జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అతడికి క్షుద్ర పూజలు చేసే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నర బలి ఇస్తే లచ్చిందేవి కరుణిస్తుందని, ఇంట్లో డబ్బు భారీగా వచ్చి చేరుతుందని సలహాతో అందుకు సీక్రెట్ గా ప్లాన్లు వేయడం ప్రారంభించాడు. పోలీసులకు దొరకకుండా ఉండాలంటే తన భార్యనే బలి ఇవ్వాలని భావించాడు. అయితే లో బీపీతో శిల్ప బాధపడేది. అలా అనారోగ్యానికి గురైనప్పుడు చెన్నేశప్పనే ఆమెకు ఇంజక్షన్ చేసేవాడు.

ఓ రోజు చెన్నేశప్ప తన భార్య శిల్పను నరబలి ఇవ్వాలని భావించాడు. లోబీపీతో బాధపడుతున్న ఆమెకు ఈ ఇంజక్షన్ చేస్తే నీ అనారోగ్యం పూర్తిగా నయమైపోతుందని నమ్మించి హై డోస్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. తన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబరపడిపోయిన చెన్నేశప్ప బంధువుల ముందు దొంగ ఏడుపు ఏడుస్తూ ఆస్కార్ లెవల్లో నటించాడు.

అయితే.. శిల్ప తల్లిదడ్రులకు అనుమానం కలిగింది. ఆమె శరీరంపై ఇంజక్షన్ గుర్తులు, నోటి వెంట రక్తం కక్కుకున్న ఆనవాళ్లు ఉండటంతో పోలీసులకు కంప్లెయింట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన రీతిలో విచారణ జరిపారు. తొమ్మది నెలల తర్వాత కేసు ఓ కొలక్కి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు విస్తు గొలిపే విషయాలు తెలిశాయి. మూఢ నమ్మకాల మాయలో పడి.. తన సొంత భార్యను చెన్నేశప్ప చంపేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. నిందితుడిని కటకటాల్లోకి పంపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement