Friday, March 29, 2024

హైకోర్టులో బీఎల్ సంతోష్ కు ఊరట

బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. సిట్ జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా బీఎల్ సంతోష్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన ఏజీ.సంతోష్ ప్రమేయంపై పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని ఏజీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నోటీసులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement