Saturday, April 20, 2024

ర‌జ‌నీకాంత్ కి బిజెపి బంఫ‌ర్ ఆఫ‌ర్-గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి ఓకేనా..!

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది బిజెపి. తమిళనాడులో బలపడాలని చూస్తున్న రజనీకాంత్‌కు గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.బీజేపీ ఆఫర్‌కు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ ఇటీవల వేస్తున్న అడుగులు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్ అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాతి రోజే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయనకు గవర్నర్ పదవి ఖాయమని చెబుతున్నారు. నిజానికి ప్రధానమంత్రి రజనీకాంత్‌తో మోడీకి మంచి స్నేహం ఉంది. ప్రధాని చెన్నై వచ్చినప్పుడు రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబంతో సరదాగా గడిపారు. బీజేపీ గవర్నర్ గిరీ ఆఫర్‌కు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గవర్నర్ పదవి అయితే ఏ పార్టీలోనూ చేరాల్సిన పని ఉండదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ ఆఫర్‌కు అంగీకరించినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement