Wednesday, April 24, 2024

మాజీ సీఎం మనవరాలు ఆత్మహత్య.. భర్త హాస్పిటల్​కు వెళ్లిన తర్వాత..

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మనవరాలు సౌందర్య బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించింది. 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. పోలీసులు దీన్ని అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కాగా, సౌందర్య ఒక డాక్టర్​..  యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కూతురు. ఆమె 2018లో తన హాస్పిటల్‌లోని సహోద్యోగి డాక్టర్ నీరజ్ ని వివాహం చేసుకుంది.

శుక్రవారం ఆమె భర్త ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఇంట్లోనే ఉందని పోలీసులు తెలిపారు. ఇంటికి పనిమనిషి వచ్చి తలుపు తట్టినా ఎవరూ రెస్పాండ్​ కాలేదు. దీంతో ఆమె నీరజ్ కు కాల్ చేసింది.. ఆ తర్వాత వెంటనే అతను అతని భార్య ఫోన్‌కు కాల్ చేసినా ఎటువంటి స్పందన రాలేదు.  దీంతో ఫిర్యాదు అందిన వెంటనే ఇంటికి వెళ్లి బలవంతంగా తలుపు తెరిచినట్లు పోలీసులు తెలిపారు. దుర్ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి బసరాజ్ బొమ్మై, పలువురు మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు యడియూరప్ప ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement