Saturday, April 20, 2024

Breaking: రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. రాజాసింగ్ పై బీజేపీ వేటు వేసింది. రాజాసింగ్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ తెలిపింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు చేపట్టింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement