Tuesday, April 23, 2024

Huzurabad: 11వ రౌండ్‌లో గెల్లు.. 12వ రౌండ్‌లో ఈటల.. విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంది?

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫ‌లితం  ఆసక్తికరంగా సాగుతోంది. ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌, బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్య స్వ‌ల్ప మెజార్టీ మాత్రమే ఉంది. దీంతో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ మ‌ళ్లీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. బీజేపీ అభ్యర్థి ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీ‌నివాస్ 367 ఓట్ల‌తో ఆధిక్యంలో ఉన్నారు. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4,326 ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుత 11వ రౌండ్ వ‌ర‌కూ 43,324 ఓట్లు టీఆర్ఎస్‌కు వచ్చాయి. టిఆర్ఎస్ పై  5306 ఓట్ల తేడాతో బిజేపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఇక, 12వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల 1217 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీకి 4849 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ కు 3632 ఓట్లు పోలైయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు బీజేపీకి 53,497, టీఆర్ఎస్ 46,974 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement