Wednesday, April 17, 2024

వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలి.. సీఎం కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుదేశించి సీఎం మాట్లాడుతూ…గోల్ మాల్ ప్రధాని చెప్పేది పచ్చి అబద్ధమన్నారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే బీజేపీకి రైతులు బుద్ది చెప్పాలన్నారు. శ్రీలంక వెళ్లిన ప్రధాని మోడీని గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారన్నారు. 2024లో బీజేపీ ముక్త భారత్ సాధించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాలు నన్ను కోరాయన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. మద్యపాన నిషేదం విధించిన గుజరాత్ లో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement