Friday, March 29, 2024

ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అదానీ వ్యవహారంతో పార్లమెంట్ గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement