Thursday, April 25, 2024

తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో కమలం పార్టీ డీలా

తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ దాదాపు ఉనికి కోల్పోయింది. రెండు చోట్ల ఏ ఒక్క రౌండ్‌లోనూ ఆధిక్యత కనబరచలేదు. ఇప్పటివరకు నాగార్జున సాగర్ ఉపఎన్నికల కౌంటింగ్‌లో 13 రౌండ్లు పూర్తికాగా ఏ రౌండ్‌లోనూ వెయ్యి ఓట్లు దాటలేదు. రెండు చోట్ల కీలక నేతలు ప్రచారం చేసినా బీజేపీకి ఆదరణ కరువయింది. తిరుపతిలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసినా కమలం పార్టీకి కలిసి రాలేదు. జనసైనికులు బీజేపీ పార్టీని అంతగా పట్టించుకోలేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పోకడలు కూడా బీజేపీకి పంటికింద రాయిలా తగిలాయి. బీజేపీతో ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా జనసేన ప్రవర్తించడం కమలం పార్టీ వర్గాలకు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement