Monday, April 15, 2024

Breaking: హవాలా మీడియేటర్లుగా బీజేపీ లీడర్లు.. కోట్లాది డబ్బుని మునుగోడులో పంచారు: కేటీఆర్​

నల్లగొండ జిల్లా ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని, మునుగోడు ఎన్నికలో అహంకారానికి, అభివృద్ధికి మధ్య జరిగిన పోరాటంలో టీఆర్​ఎస్​ని గెలిపించిన మునుగోడు ప్రజలకు టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. ఇవ్వాల (ఆదివారం) హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను పేర్కొన్నారు మంత్రి కేటీఆర్​. బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల కుయుక్తులు, ఆటలు తెలంగాణలో సాగవని ఈ గెలుపుతో మునుగోడు ప్రజలు స్పష్టం చేశారన్నారు.

మొట్టమొదటి సారి ఢిల్లీ నుంచి వందల కోట్ల రూపాయల డబ్బులు, మద్యంతో అధికార మదంతో మునుగోడు ఓటర్లను కొనాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారని మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్​రెడ్డికి చెందిన వ్యక్తి చొప్పరి వేణు కోటి రూపాయలతో దొరికాడని, మరో నేత ఈటల రాజేందర్​కు చెందిన వ్యక్తి 98 లక్షలతో పట్టుబడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు. మరో నేత వివేక్​కు చెందిన వ్యక్తి నుంచి హవాలా ద్వారా కోట్లాది రూపాయలను తీసుకొచ్చింది నిజం కాదా అని నిలదీశారు మంత్రి కేటీఆర్​.

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి బీజేపీలో చేరగానే వివేక్​ వెంకటస్వామి హవాలా ఆపరేటర్​ మాదిరిగా 75 కోట్లు ఇచ్చింది నిజం కాదా.. సుశీ ఇన్​ఫ్రా నుంచి 5.25 కోట్ల రూపాయలు మునుగోడులోని ఓటర్లకు, బీజేపీ నాయకులకు బ్యాంక్​ అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేసింది నిజం కాదా అని ఆధారాలతో సహా బయటపెట్టారు కేటీఆర్​.

- Advertisement -

15 కంపనీల సీఆర్​పీఎఫ్​ పోలీసులు అంటే ఒక్కో కంపనీలో దాదాపు 80 మంది ఉంటారు. 40 ఐటీ టీములు ఒక్కోటీమ్​లో 10 మంది దాకా ఉంటారు.. ఇంత మందిని మునుగోడుకు కేంద్ర ప్రభుత్వం పంపింది నిజం కాదా అని నిలదీశారు. వీటన్నిటిన ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తే కేంద్రలోని పెద్దలు ఒత్తిడి చేసి వాటిని అడ్డుకునే యత్నాలు చేసింది నిజం కాదా అన్నారు మంత్రి కేటీఆర్​. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దే ప్రయత్నం చేసింది బీజేపీ అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement