Thursday, April 18, 2024

సీఎం కేసీఆర్ కు బీజేపీ నేత బండి సంజయ్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటి వరకూ కేవలం పది శాతం ధాన్యమే కోనుగోలు చేశారని.. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించి 20 రోజులు గడుస్తున్నప్పటికీ 2500 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారని సంజయ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు సత్వర చర్యలు చేపట్టాలని బండి సంజయ్ లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement