Friday, April 19, 2024

నిధులపై తేల్చుకుందాం రాః సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న టీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిధుల విషయంలో తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వడం లేదని, అన్యాయం చేస్తోందని నిరూపిస్తే అక్కడికక్కడే తన పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రమే నిధులు ఇస్తోందని నిరూపిస్తే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా ? అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ కేప్టెన్‌ అయితే ఎంఐఎం వైస్‌ కెప్టెన్‌, కాంగ్రెస్‌ నేతలు ఎక్స్‌ట్రా ప్లేయర్ల లాంటి వాళ్లన్నారు.  టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్‌ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసింది, పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలేనని బండి గుర్తు చేశారు.

ఇది కూడా చదవండిః ఏపీలో చంద్రబాబుకే రక్షణ కరువైందిః మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement