Saturday, April 20, 2024

Breaking: అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తోన్న బీజేపీ.. కవిత

బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ముషీరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారన్నారు. విపక్షాలు అనుకునే వాళ్లపై ఎటాక్ చేస్తున్నారన్నారు. లేనిపోని లీకులిచ్చి వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. కేంద్రం రకరకాల పద్దతుల్లో వ్యవస్థలను వాడుకుంటోందన్నారు. బీజేపీ విధానాలను నిలదీసే వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. దీనిపై యువతలో చైతన్యం తీసుకురావాలన్నారు. జన జాగృతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement