Friday, April 19, 2024

కేజ్రీవాల్​ని చంపేందుకు బీజేపీ కుట్ర.. సెక్యూరిటీని ధ్వంసం చేసి సీఎం ఇంటిపై దాడి: మనీష్​ సిసోడియా

భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఇవ్వాల (బుధవారం) దాడి చేసి ధ్వంసం చేశారు. సీఎం నివాసంపై దాడి తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. కాశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని ఆరోపిస్తూ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనకు ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలోని బీజేపీ కార్యకర్తలు ఆయన నివాసం ఎదుట ధర్నా చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ తన ప్రసంగంలో కశ్మీర్ ఫైల్స్ ను ప్రచారం చేస్తున్నందుకు బీజేపీపై విమర్శలు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఈ దాడిని ఖండిస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఈరోజు ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే ఢిల్లీ పోలీసులతో కలిసి బీజేపీ గూండాలు సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సీఎం ఇంటి చుట్టూ సీసీటీవీలను ధ్వంసం చేశారు. సీఎం ఇంటి చుట్టూసెక్యూరిటీ ప్రొటెక్షన్​ని దెబ్బతీశారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో బీజేపీ గూండాలు ఇదంతా చేశారు. అని ఆయన మండిపడ్డారు. సీఎంను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement