Friday, April 19, 2024

Covid: బీజేపీ చీఫ్ నడ్డాకు కరోనా

దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. సాధారణ పౌరులతో పాటు వరుసగా ప్రముఖులు కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని జేపీ నడ్డా తెలిపారు. తనకు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో వెంట‌నే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని జేపీ నడ్డా పేర్కొన్నారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేరకు ఇంటిలోనే ఐసోలేట్ అయ్యానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కూడా కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నడ్డా ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement