Saturday, April 20, 2024

119 నియోజకవర్గాలకు పాలక్ లను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ నాయకత్వం పాలక్ లను నియమించింది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు పాలక్ సభ్యులు నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లుగా నియమించారు. ఈ నేపథ్యంలో వీరందరికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement