Thursday, April 25, 2024

సూర్యాపేట: చివ్వేంలో ఉద్రిక్తత.. బీజేపీ- టీఆర్ఎస్ పర్సపర దాడులు

సూర్యాపేట జిల్లా చివ్వేంల IKP సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివ్వేంల IKP సెంటర్ కు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకన్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమలోం రాళ్లు, చెప్పులు, కర్రలతో పరస్పర దాడు చేసుకున్నారు. అర్వపల్లిలో బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. బీజేపీ కార్యకర్తలను రాళ్లు, కర్రలతో టీఆర్ఎస్ నాయకకులు తరిమికొట్టారు. ఈ క్రమంలో రైతులకు బీజేపీ కార్యకర్తలు రక్షణ కల్పించారు. IKP సెంటర్ లో రైతుల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. IKP సెంటర్ లో చివ్వేంల, పెనుబాడ సూర్యాపేట, సూర్యాపేట రురల్ నుంచి వచ్చిన TRS నాయకులు గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement