సూర్యాపేట జిల్లాలో ఇవ్వాల ఉదయమే దారుణం జరిగింది. మునగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడ్వాయి గ్రామంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైకు అదుపుతప్పి బర్రెలను గుద్దింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డరు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. అతని పరిస్థితి సిరియస్గానే ఉందని డాక్లర్లు చెప్పారు. మృతులను కలకోవకు చెందిన రఘు, నరహరిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Breaking: బర్రెలను గుద్దిన బైకు.. స్పాట్లో ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి సీరియస్
Advertisement
తాజా వార్తలు
Advertisement