Friday, April 19, 2024

Big Breaking: నార్సింగిలో ప‌ట్టుబ‌డ్డ కోటి రూపాయ‌లు.. హ‌వాలా మ‌నీగా అనుమానం!

హైదరాబాద్ లో ఓ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందింది. సిటీలోని నార్సింగి వద్ద కోటి రూపాయల నగదును పోలీసులు ప‌ట్టుకున్నారు. హ‌వాలా మ‌నీగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే.. ప‌ట్టుబ‌డ్డ డ‌బ్బు ఎక్క‌డిద‌ని ఆరా తీస్తున్నారు. త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బు హ్యాకర్లకు ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నామ‌ని అనుమానితులు పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా, దీనికి సంబంధించి కోటి రూపాయ‌ల‌కు రెండు కోట్లు ఇస్తామ‌ని అనుమానితులు చెప్పార‌ని స‌మాచారం. ఈ న‌గ‌దుకు సంబంధించి ముగ్గురిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ప‌ట్టుబ‌డ్డ నగదును ఐటీ అధికారులకు అప్ప‌గించారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement