Friday, April 26, 2024

Big Breaking : మంత్రి న‌వ‌కిషోర్ దాస్ పై కాల్పులు.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ఒడిశా మంత్రిపై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఆరోగ్య‌శాఖ మంత్రి న‌వ‌కిషోర్ దాస్ పై కాల్పులు జ‌రిపారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. దాంతో న‌వ‌కిషోర్ దాస్ కి తీవ్ర‌గాయాలు అయ్యాయి. దాంతో అత‌నిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ్రెజిరాన‌గ‌ర్ గాంధీ చౌక్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ మంత్రి పై కాల్పులకు దిగాడు. తీవ్రంగా గాయపడిన మంత్రిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. జార్సుగూడ జిల్లాలో బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతున్న సమయంలో సమీపం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడిని ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు. సొంత రివాల్వర్ తోనే అతడు కాల్పులకు పాల్పడ్డాడు. మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇంకా తెలియలేదని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement