Wednesday, April 24, 2024

Big Breaking : ఇండోనేషియాలోని ప‌శ్చిమ జావాలో భారీ భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 6.4గా న‌మోదు

ఇండోనేషియాలోని ప‌శ్చిమ జావా ప్రాంతంలో భారీ భూకంపం న‌మోద‌యింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. భారీ భూకంపం దృష్ట్యా సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ప్రాణ ఆస్థి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దేశంలోని పశ్చిమ జావా ప్రాంతంలో శనివారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 118 కిలోమీటర్ల లోతులో నమోదైందని దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ BMKG తెలిపింది. సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 20 సెకన్లపాట్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement