Friday, March 29, 2024

Big Breaking : రేపు క‌రీంన‌గ‌ర్ లో బండిసంజ‌య్ మౌన‌ దీక్ష – ప్ర‌జ‌ల ఘోష‌..బిజెపి భ‌రోసా పేరుతో బైక్ ర్యాలీలు

పోడు భూముల స‌మ‌స్య‌, ధ‌ర‌ణి పోర్ట‌ల్ పై క‌రీంన‌గ‌ర్ లో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మౌన‌ దీక్ష చేయ‌నున్నారు. 119నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకేసారి బైక్ ర్యాలీకి బీజేపీ ప్లాన్ చేస్తుంది. బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో ఈ మేర‌కు క‌మిటీ జ‌రిగింది. కాగా కోర్ క‌మిటీ, చేరిక‌ల క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. పార్టీలో చేరిక‌లు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మిటీకి సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ నెల 21నుండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బైక్ ర్యాలీలు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌జ‌ల ఘోష‌..బిజెపి భ‌రోసా పేరుతో బైక్ ర్యాలీలు జ‌ర‌గ‌నున్నాయి. స‌రైన అభ్య‌ర్తి లేని నియోజ‌క‌వ‌ర్గంలో చేరిక‌ల‌పై దృష్టి పెట్టాల‌ని త‌రుణ్ చుగ్ సూచించారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స‌క్సెస్ అయ్యే వ‌ర‌కు పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టొద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement