Friday, April 26, 2024

Big Breaking: అస‌దుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పులు

యూపీలో ఎంఐఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పులు జ‌రిగాయి. మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు వ్య‌క్తులు కాల్పులు జ‌రిపార‌ని అసదుద్దీన్ తెలిపారు. కాల్పుల్లో అస‌దుద్దీన్ కారు టైర్లు పేలాయి. అయితే తాను క్షేమంగా ఉన్నాన‌ని అస‌దుద్దీన్ ఓవైసీ తెలిపారు.

యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. మూడు నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు. మీరట్‌ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల విషయాన్ని ధ్రువీకరించారు ఒవైసీ అసదుద్దీన్‌. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పలు స్థానాల్లో పోటీ చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఒవైసీ అసదుద్దీన్‌ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎస్పీ, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

https://twitter.com/namuraad123/status/1489215400655360004

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement