Thursday, April 25, 2024

Big Breaking : ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీల పెంపు – ప్ర‌క‌టించ‌నున్న స‌ర్కార్

ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్ర‌క‌ట‌న చేయ‌నుంది ప్ర‌భుత్వం. 2019లో ఛార్జీలు పెంచిన ఏపీఎస్ ఆర్టీసీ ..డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో నెల‌కు రూ. వెయ్యి కోట్ల భారం ప‌డుతోంది. దాంతో ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపున‌కు రంగం సిద్ధ‌మ‌యింది. మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు ఆర్టీసీ ఛైర్మ‌న్, ఆర్టీసీ ఎండీ ప్రెస్ మీట్ పెట్ట‌నున్నారు. దాంతో టిక్కెట్ రేటు ఎంత పెంచాల‌నేదానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జిలు పెంచ‌గా..ఇప్పుడు ఏపీలో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై అద‌న‌పు భారాన్ని వేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement