Thursday, April 25, 2024

Kurnool: భూమానాగిరెడ్డి విగ్రహావిష్కరణలో వివాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో విగ్రహాల రాజకీయ చెలరేగింది. భూమా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా తన సొంత స్థలంలో నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి విగ్రహాలను బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే, కిషోర్ రెడ్డికి తెలియకుండానే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ విగ్రహాలను ఆవిష్కరించడంతో వివాదం నెలకొంది. నేడు భూమా నాగిరెడ్డి వర్థంతి  సందర్భంగా భూమా దంపతుల విగ్రహాలను భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి వచ్చి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలకు పాలాభిషేకం కూడా చేశారు. దీంతో విగ్రహాలు ఏర్పాటు చేసిన కిశోర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అఖిలప్రియ తనకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారని కిశోర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement