Tuesday, April 23, 2024

Be Alert: భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో జాగ్రత్త.. ముంపు ప్రాంతాల్లో ముమ్మ‌ర చర్య‌లు చేప‌ట్టాలే: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పై మంత్రి కేటీఆర్ ఇవ్వాల (బుధ‌వారం) ప‌లువురు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలక సంఘాలు పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు.

ఇక‌.. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైనా ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగవంతం చేయాల‌న్నారు మంత్రి కేటీఆర్‌. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పై కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలన్నారు.

కాగా, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచన చేశారు. హైదరాబాద్ సిటీ, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ.. తగ్గింపు చర్యలు చేపట్టాలన్నారు మంత్రి కేటీఆర్‌.

ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని పూరపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంకు కు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పట్టణాలు, పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలి. వాటి యొక్క పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వంటి పై సాగునీటి శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని సూచించారు మంత్రి కేటీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement