Thursday, April 25, 2024

ధైర్యంగా ఉండు జిగ్నేష్ మేవానీ… సత్యమే గెలుస్తుంది – ప్ర‌కాశ్ రాజ్

సోష‌ల్ మీడియాలో ప్ర‌ధాని మోడీపై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసినందుకు గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారు పోలీసులు.కాగా నిన్న బెయిల్ వచ్చినప్పటికీ, ఆ వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మహాత్మాగాంధీని చంపిన గాడ్సేనే స్వతంత్ర భారతదేశపు తొలి ఉగ్రవాది. గాడ్సేని గుండెల్లో పెట్టుకుని, పెదవులపై గాంధీ నామస్మరణ చేస్తూ కుహనా రాజకీయ నాయకుల పట్ల సిగ్గుపడాలి. ధైర్యంగా ఉండు జిగ్నేష్ మేవానీ… సత్యమే గెలుస్తుంది” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement