Saturday, April 20, 2024

శ్మశానం వద్ద బీజేపీ ఫ్లెక్సీలు.. నెటిజన్ల చీవాట్లు

కర్ణాటకలో కరోనా మహమ్మారి కల్లోకలం సృష్టిస్తోంది. ఒకపైపు కేసులు సంఖ్య పెరుగుతుంటే… మరోవైపు కరోనా మరణాలు అధికమవుతున్నాయి. అయితే, కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి విమర్శల పాలైంది. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద అధికారులు ఉచితంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే పబ్లిసిటీ పిచ్చితో నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో సోమవారం ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి…అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు.

ఈ విషయం నెలమంగల బీజేపీ నేతలకు తెలియడంతో కార్యకర్తలకు క్లాస్ పీకి ఆ ఫ్లెక్సీని తొలగించమని ఆదేశించారు. దీనిపై బెంగళూరు అభివృద్ధి అథారిటీ(బీడీఏ) చైర్మన్ ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అప్పటికే ఆ ఫ్లెక్సీలను కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయ్యాయి. బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహంతా ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు. ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement