Wednesday, April 24, 2024

జింబాబ్వేపై బంగ్లాదేశ్ విజయం.. బౌలర్ల కీలక పాత్ర

మూడు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది జింబాబ్వే. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. టీ20లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ ముల్ హుస్సేన్ షాంతో చెలరేగి ఆడాడు. 55 పరుగులకు 71 స్కోర్ సాధించి.. జట్టు మెరుగైన స్కోరులో కీలకంగా వ్యవహరించాడు. ఇతడి తర్వాత అఫీఫ్ హుస్సేన్ చేసిన 29 పరుగులు రెండో అత్యధిక స్కోరుగా ఉందంటే.. ఆ జట్టు ఎలా ఆడిందో తెలుసుకోవచ్చు. రిచర్డ్ నగ్రవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో రెండు వికెట్లు తీశారు. 151 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుతిరిగారు. సీన్ విలియమ్స్ ఒక్కడే ధాటిగా ఆడాడు. 42 పరుగులకు 64 స్కోర్ సాధించాడు. ఇతడు తప్పించి మరో ఆటగాడు పోరాట పటిమను చూపలేకపోయాడు. దీంతో చివరికి జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. 147 పరుగుల వద్ద ఆగిపోయింది. తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టడి చేశారు. తద్వారా బంగ్లాదేశ్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement