Saturday, April 20, 2024

Bangalore: ప్రారంభ‌మైన ఐపీఎల్ వేలం : ధావన్ ను రూ.8.25కోట్లకు దక్కించుకున్న పంజాబ్

బెంగ‌ళూరులో ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం ప్రారంభ‌మైంది. అయితే ఈసారి ఐపీఎల్ లో కొత్త‌గా మ‌రో రెండు జ‌ట్లు రంగంలోకి దిగ‌నున్నాయి. ఐపీఎల్ వేలంలో 600 మంది ఆట‌గాళ్లు పాల్గొన‌నున్నారు. IPL-2022లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ రెండు కొత్త జట్లు ఈ ఏడాది నుంచి బరిలోకి దిగనున్నాయి. శిఖ‌ర్ ధావ‌న్ ను పంజాబ్ రూ.8.25కోట్ల‌కు ద‌క్కించుకుంది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ ను రూ.5కోట్ల‌కు రాజ‌స్థాన్ జ‌ట్టు ద‌క్కించుకుంది. కోల్ కతా జట్టు ప్యాట్ కమిన్స్ ను రూ.7.25కోట్లకు దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement