Monday, April 15, 2024

బండ్ల గణేశ్ ను వెంటాడుతున్న కరోనా.. మూడోసారి పాజిటివ్

టాలీవుడ్ ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా మరోసారి సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. తాజాగా మూడోసారి కరోనా సోకింది. గత మూడ్రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని, నిన్న సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తెలిపారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు మాత్రం కరోనా నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు.  ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఇంట్లోనే అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

కాగా, ఫస్ట్ వేవ్ లో బండ్ల గణేశ్ బారిన పడి త్వరగానే కోలుకున్నారు. అయితే, సెకండ్ వేవ్ సమయంలో మాత్రం గణేష్‌ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారింది. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చొరవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకోవాల్సి వచ్చింది.

https://twitter.com/ganeshbandla/status/1480226642442145793

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement