Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ..

సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి లేఖ రాశారు.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంపై ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని నిలదీశారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

2018 ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్‌ హామీని ఏమైందని  లేఖలో ప్రస్తావించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 5 నుంచి 6 లక్షల ఆర్థికసాయం మాట ఏమైందని ప్రశ్నిచారు. ఇప్పటివరకు ఒక్కరైనా లబ్ధిదారులు ఉన్నారా..? అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం 2లక్షల 91వేల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసిందన్న బండి.. ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారని మండిపడ్డారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తిచేశారని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Advertisement

తాజా వార్తలు

Advertisement