Saturday, April 20, 2024

వ‌డ‌దెబ్బ‌కి గుర‌యిన బండిసంజ‌య్ – విశ్రాంతి అనంత‌రం పాద‌యాత్ర కొన‌సాగింపు

వ‌డ‌దెబ్బ‌కి గుర‌య్యారు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. ప్ర‌స్తుతం ఆయ‌న పాద‌యాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.
బండి సంజ‌య్ వ్యక్తిగత వైద్యుడు ఆయనకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, తనకు ఏదోలా ఉందని సంజయ్ చెప్పారని, వెంటనే చికిత్స అందించామని, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించానని అన్నారు. మరోవైపు డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. మక్తల్ టౌన్ లో బహిరంగసభను నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement