Thursday, April 25, 2024

ఢిల్లీకి బండి సంజయ్… మతలబ్ క్యా హై?

హుజురాబాద్ ఉపఎన్నికకు టైం దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం బండి సంజయ్ ఢిల్లీకి వెళ్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు, అక్కడ ప్రస్తుత పరిస్థితులను బండి సంజయ్ బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలను హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి రావాల్సిందిగా బండి సంజయ్ ఆహ్వానించనున్నారు.

మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీతోపాటు ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పై మాటల దాడిని పెంచారు.

ఇది కూడా చదవండి: దత్తపీఠంలో అమ్మవారికి సీఎం జగన్‌ పూజలు

Advertisement

తాజా వార్తలు

Advertisement