Saturday, April 20, 2024

కేసీఆర్ కు బండి సవాల్..

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ రోజు బండి సంజయ్, మ‌హిళా నేత విజ‌యశాంతితో పాటు ప‌లువురు నాయ‌కులు సాగ‌ర్ లోని ప‌లు ప్రాంతాల్లో ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌పై సీఎం కేసీఆర్ చ‌ర్చ‌కు సిద్ధ‌మా? అని బండి సంజయ్ ప్ర‌శ్నించారు. తాము ప్ర‌జ‌ల కోసం పోరాడుతుంటే త‌మ‌పై కేసీఆర్ అక్ర‌మ కేసులు పెట్టిస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. మ‌ద్యం, డ‌బ్బులు పంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ గెల‌వాల‌ని చూస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. కేంద్ర నిధులతో సాగర్ అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ప్ర‌చారంలో పాల్గొన్న విజ‌యశాంతి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పి కేసీఆర్ మోసం చేశార‌ని విమ‌ర్శించారు. ఇంటింటికీ న‌ల్లా నీళ్లు ఇవ్వ‌కుంటే మ‌ళ్లీ ఓట్లు అడ‌గ‌న‌ని చెప్పిన కేసీఆర్ ఆ ప‌ని చేయ‌కుండా మ‌ళ్లీ ఓట్లు అడుగుతున్నార‌ని మండిపడ్డారు. తెలంగాణ‌లో భూముల కబ్జాలు పెరిగిపోయాన‌ని చెప్పారు. కేసీఆర్ పొగ‌రును అణ‌చివేయాలంటే బీజేపీకి ఓట్లు వేయాల‌ని ఆమె కోరారు. సాగర్ ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని విజయశాంతి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement