Friday, April 19, 2024

Telangana: బండి, ఈటల కలిసి నన్ను ఓడించారు.. కార్యకర్తల ముందు రాజగోపాల్​రెడ్డి ఆవేదన?

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత రియలైజ్​ అయ్యారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి. ఇవ్వాల (సోమవారం) తన అనుచరులతో జరిపిన భేటీలో మనుసులో మాటను వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ విషయంపై బీజేపీ నేతల నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు..

ఇక.. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ క్యాంపు ఆఫీసులో అనుచరులు, కార్యకర్తలతో రాజగోపాల్​రెడ్డి ఇవ్వాల భేటీ అయినట్టు సమాచారం. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తనను కావాలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, ముఖ్య నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఓడించారని కార్యకర్తలముందు వాపోయినట్టు తెలుస్తోంది. తాను గెలిస్తే ఎక్కడ వాళ్లకు పోటీగా మారుతానేమోనని బండి సంజయ్​, ఈటల రాజేందర్​ కలిసి తనను ఓడించారని అన్నట్టు సమాచారం.

ఎన్నికల్లో డబ్బుల తరలింపుపై పోలీసులకు లీకులు ఇచ్చింది వారేనని, గ్రౌండ్​ రిపోర్టు తమకు అనుకూలంగా లేదని పార్టీ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారన్నారు. అట్లా జేపీ నడ్డా బహిరంగ సభ పెట్టకుండా అడ్డుకున్నారని రాజగోపాల్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బీజేపీ నేతల నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. ఈ వార్త ఎంతవరకు కరెక్ట్​ అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే.. ఈ వార్త మాత్రం పెద్ద ఎత్తున సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement