Thursday, April 25, 2024

Balakrishna: సిరివెన్నెలకు నివాళి.. బాలయ్య కంటతడి

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం కన్నుమూసిన సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, హీరో విక్టరీ వెంకటేష్, నటులు సాయికుమార్, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి, మణిశర్మ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.

హీరో నందమూరి బాలకృష్ణ సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల అని బాలయ్య కొనియాడారు. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని బాలయ్య కంటతడి పెట్టుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement