Thursday, April 25, 2024

2.3అడుగుల వ్యక్తి..తన పెళ్లికి ప్రధాని మోడీ..యూపీ సీఎంలని ఆహ్వానించనున్న అజీమ్ మన్సూరి

అతని ఎత్తు2.3అడుగులు ఉంటాడు అజీమ్ మన్సూరి అనే వ్యక్తి. అయితే ఇతనికి వివాహం కుదిరిందట. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ..యూపీ సీఎం యోగిలను తన పెళ్లికి ఆహ్వానించనున్నాడట.చిన్నప్పుడు పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మన్సూరి ధైర్యంగా నిలబడ్డాడు. షామ్లీ జిల్లాలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని నడుపుతూ జీవతం సాగిస్తున్నాడు. అజీమ్ మన్సూరి ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ ఏడాది నవంబర్‌లో తను పెళ్లి చేసుకోబోతున్నాడు. తను పెళ్లి చేసుకోబోయే వధువు ఎత్తు 3 అడుగులు కావడం విశేషం. తమ పెళ్లికి ప్రధానితో పాటు యూపీ సీఎం హాజరుకావాలని అజీమ్ కోరుకుంటున్నాడు.

ఇందులో డిల్లీ వెళ్లి మోదీతో పాటు యోగి ఆదిత్యనాథ్ ని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తానని అజీమ్ వెల్లడించాడు. మరుగుజ్జు కావడంతో పెళ్లికూతురు కోసం తను చాలా సంవత్సరాలని వెతికాడు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని పలువురు రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కూడా కలిసి విజ్ఞప్తి చేశాడు. తనకు పిల్లను చూసి పెట్టాలంటూ 2019లో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశాడు. ఐదో తరగతితో చదువు ఆపేసిన మన్సూరికి చాలా సంవత్సరాల పోరాటం తర్వాత హాపూర్ గ్రామంలో అతనికి వధువు దొరికింది. గతేడాది మార్చిలో 3 అడుగుల పొడవు ఉన్న బుషారాను కలిశాడు. అదే ఏడాది ఏప్రిల్ లో వీళ్ల నిశ్చితార్థం జరిగింది. అయితే, బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. నవంబర్ 7న వీళ్ల పెళ్లి జరగనుంది. పెళ్లికి మన్సూరి ప్రత్యేకమైన షేర్వానీ, త్రీ-పీస్ సూట్‌ను కుట్టించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement