Thursday, April 25, 2024

Breaking: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దాడి.. రైల్వే ఉద్యోగి మృతి

హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జిర్ర ప్రదీప్ అదే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్ కుమార్ కు డబ్బులు అప్పుగా ఇవ్వగా.. గడువు ముగియడంతో తిరిగి ఇవ్వాలని అడగగా నిన్న రాత్రి పెసరి వినయ్ గొడ్డలితో జిర్ర ప్రదీప్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయ‌ప‌డ్డ‌ ప్రదీప్ ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందినట్టు సమాచారం. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మృతుడు జిర్ర ప్రదీప్ కొన ఊపిరితో ఉండి కూడా తనపై దాడి చేసిన వారి వివరాలను తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement