Thursday, April 25, 2024

జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి దారుణం.. చ‌ట్ట‌ప‌ర‌మైన యాక్ష‌న్ ఉంటుంద‌న్న కేటీఆర్‌

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిన్న బీజేపీ కార్పొరేటర్లు చేపట్టిన ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కార్పొరేటర్లతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆఫీసులోకి చొచ్చుకొచ్చి గొడ‌వ‌కు ఆందోళ‌న చేయ‌డంపై రియాక్ట‌య్యారు. బల్దియా హెడ్ ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించడం, రాద్దాంతం చేయ‌డంపై ట్వీట్ చేశారు కేటీఆర్‌..

‘‘హైదరాబాద్‌లో బీజేపీకి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు నిన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దారుణమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. గాంధేయ పద్ధతిలో ప్రవర్తించమని గాడ్సే భక్తులను కోర‌డం కూడా అంత స‌రైంది కాదు. విధ్వంసానికి పాల్ప‌డ్డ వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు సూచించారు మంత్రి కేటీఆర్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement