Wednesday, April 24, 2024

ఉత్తరప్రదేశ్​లో దారుణం.. 14 ఏళ్ల దళిత బాలికపై అగ్రవర్ణ యువకుల గ్యాంగ్​ రేప్​

భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఆజాదీకా అమృత్​ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్​లో మాత్రం దారుణ ఘటనలు ఆగడం లేదు. యూపీ​లో తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వారణాసిలో అమానవీయ ఘటన జరిగింది. గౌరీగంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఒక విలేజ్​లో 14 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు అగ్రవర్ణాలకి చెందిన వ్యక్తులు గ్యాంగ్​ రేప్​కి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది.

మొన్న రాత్రి బాలికను తోటలోకి లాక్కెళ్లి హిందూ ఫ్యామిలీస్​కి చెందిన ఈ ముగ్గురు యువకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని ఎస్సీ ఎలమరన్​జీ తెలిపారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బాలికను గ్యాంగ్​ రేప్​ చేశారన్నారు. బాధిత బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement