Thursday, April 25, 2024

Flash: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాగా, నిన్న సాయంత్రం ఢిల్లీలోని ముండ్​కా మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 60 నుంచి 70 మందిని సురక్షితంగా కాపాడారు. భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు 24 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించాయి. భవనంలో చిక్కుకున్న మరికొందరిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement