Friday, March 29, 2024

ఆస్కార్ రేసులో నిలిచిన ‘షార్ట్ ఫిల్మ్’ .. ఇప్ప‌టికే 900అవార్డులు ..

ఆస్కార్ రేసులో నిలిచింది షార్ట్ ఫిల్మ్ మ‌న‌సా న‌మః. ఆస్కార్ 2022స్క్రీనింగ్ కు ఈ షార్ట్ ఫిల్మ్ అర్హ‌త సాధించ‌డం విశేషం. డిసెంబరు 10 నుంచి ఈ లఘు చిత్రాన్ని ఆస్కార్ సభ్యులకు ప్రదర్శించనున్నారు. ఆస్కార్ సభ్యుల నుంచి గణనీయమైన స్థాయిలో ఓట్లు పొందగలితే ఈ షార్ట్ ఫిలింకు విశిష్ట పురస్కారం ఖాయమైనట్టే! హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మనసా నమః’ యూనిట్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ షార్ట్ ఫిల్మ్ ని దీప‌క్ డైరెక్ట‌ర్. కాగా ఈ ఫిల్మ్ లో విరాజ్ అశ్విన్ , దృశిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స్థాయిలో పలు వేదికలపై పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 900 వరకు అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement