Thursday, March 28, 2024

పోషణ్​ అభియాన్‌ అమలులో ఆసీఫాబాద్‌ బెస్ట్‌.. మరోసారి పీఎం అవార్డుకు ఎంపిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోషణ అభియాన్‌ – 2021 అమలులో కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా ప్రధాన మంత్రి అవార్డుకు ఎంపిక కావటంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మ#హళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌తోపాటు జిల్లా యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

తాజాగా మరోసారి పోషణ అభియాన్‌ నిర్వ#హణలో కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికై రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతను చాటిందన్నారు. మ#హళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసిఆర్‌ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టీ ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది నుంచి కేసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం కూడా అమలు కాబోతోందన్నారు. ఈ పథకం అమలుకు నిర్ణయించిన 9 జిల్లాల్లో కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కూడా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement